Rekha Gupta | రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో ఢిల్లీ సీఎం భేటీ
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇవాళ మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ను కలిశారు. ముందుగా రాష్ట్రపతి భవన్కు వెళ్లిన సీఎం రేఖా గుప్తా.. అక్కడ ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వంగా కలిశారు. అనంతరం వైస్ ప్రెసిడెంట్ ఎన్క్లేవ్లో ఉపరాష్ట్రపతి ధన్ఖర్ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరితోనూ సీఎం ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యాలయాలు ఎక్స్ వేదికగా పోస్టు చేశాయి.
కాగా, ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. రామ్లీలా మైదానంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. మంత్రులుగా పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా, మన్జీందర్ సింగ్ సిర్సా, ఆశిష్ సూద్, రవిందర్ ఇంద్రాజ్ సింగ్, పంకజ్ సింగ్ సైతం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సచివాలయంలో రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం మొదటి మంత్రివర్గ సమావేశం జరిగింది.