రాజకీయం తగదు..

  • అలా చేస్తే.. ఊరుకోం..

మంథని, ఆంధ్రప్రభ : ప్రకృతి వైపరీత్యాలతో రాజకీయం తగదని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పైన తీవ్రంగా మండిపడ్డారు. శనివారం మంథని పట్టణం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ… ఇటీవలే వ్యవసాయ మార్కెట్ లో పుట్ట మధు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రకృతి వైపరీత్యాలను ఆపడం ఎవరి తరం కాదు ముందస్తు చర్యలలో భాగంగా మార్కెట్ లో రైతులకు కావలసినటువంటి ధాన్యం తడవకుండా కవర్లు అందుబాటులో సిద్ధం చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రైతులు వరి వేస్తే.. ఉరి అని కేసిఆర్ బహిరంగంగానే తెలిపారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక గింజ కోత లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు త్వరితగతిన డబ్బులను వారి అకౌంట్లో జమ చేయడం ద్వారా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి విషయంలోనూ మంత్రి శ్రీధర్ బాబును ముందు పెట్టి మాట్లాడడం తగదని హెచ్చరించారు. మంత్రి శ్రీధర్ బాబు నియోజక వర్గానికి, రాష్ట్రానికి అభివృద్ధిలో ముందు ఉంచాలని కష్టపడుతున్నట్లు గుర్తు చేశారు.

అన్ని కులాలకు సంఘ భవనాలు, గాని కమ్యూనిటీ హాల్లో గాని కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. రైతులకు అకాల వర్షాల దృష్ట్యా రెండు కొత్త బాయిలర్లను తీసుకోవడం జరిగింది వాటిని త్వరలోనే ట్రాన్స్ఫారం ఫీడ్ చేసి వాటిని వాడుకలోకి చేసుకుంటామని వారు తెలిపారు.

రైతులు త్వరితగతిన వడ్లను ఆరబెట్టుకొని ధాన్యాన్ని మార్కెట్ కొనుగోలు చేస్తుందని తెలిపారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో క్వింటాకు రెండు నుండి ఐదు కిలోల కోత విధించడం జరిగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పండించిన దానికి బోనస్ లు అందజేస్తున్నామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో మిల్లర్లు దళారులు కుమ్మక్కై రైతులను మోసం చేశారని తద్వారా రైతు చాలా నష్టపోవడం జరిగిందని, ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply