హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పదవతరగతి ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హజరయ్యారు. రవీంద్రభారతి వేదికగా నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను ప్రకటించనున్నారు.
ఫలితాల వెల్లడి అనంతరం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్
https://bse.telangana.gov.in
లేదా
https://results.bse.telangana.gov.in/
లలోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇక ఏప్రిల్ 15వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తైంది. కానీ ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడికాకపోవడంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఈసారి పదో తరగతి విద్యార్ధులకు గ్రేడ్స్ ఇవ్వడానికి బదులు గతంలో మాదిరి విద్యార్ధులకు మార్కులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధివిధాలను రూపొందించడంలో జాప్యం నెలకొనడం మూలంగా టెన్త్ ఫలితాల వెల్లడి ఆలస్యమైంది.
ఈ రోజు విడుదలయ్యే ఫలితాల్లో విద్యార్ధులకు వచ్చిన మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ కూడా ప్రకటించనున్నారు.ఈ లెక్కన 91-100 మార్కులకు ఏ1, 81-90 మార్కులకు ఏ2, 71-80 బి1, 61-70 బి2, 51-60 సి1, 41-50 సి2, 35-40 డి గ్రేడులుగా నిర్ణయిస్తారు.
ఈఏడాది రాత పరీక్షలు 80 మార్కులకు, ఇంటర్నల్ మార్కులు 20 మార్కులను నిర్వహించారు. ఈ మేరకు మార్కుల మెమోలను జారీ చేస్తారు. అలాగే వచ్చే ఏడాది నుంచి టెన్త్లో ఇంటర్నల్ మార్కులను కూడా తొలగించి, మొత్తం 6 సబ్జెక్టులకు 100 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు.రాత పరీక్షకు సంబంధించి హిందీలో 16 (పాస్ మార్కులు 20), మిగిలిన సబ్జెక్టుల్లో 28 వస్తే (పాస్ మార్కులు 35) పాసైనట్లు పరిగణిస్తారు