మానవత్వం చాటుకున్న కలెక్టర్

మానవత్వం చాటుకున్న కలెక్టర్

విజయనగరం, ఆంధ్ర ప్రభ : విజయనగరం జిల్లా(Vizianagaram District) కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తుఫాన్ ప్రభావిత మండలాల పర్యటనకు వెళ్లారు. అయితే.. అలా వెళుతున్నప్పడు గజపతినగరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి గాయపడిన వ్యక్తులకు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయించి తక్షణం ఆసుపత్రికి తరలించారు.

ఎక్కడైనా ప్రమాదం, అత్యవసర పరిస్థితి ఉంటే మానవతా దృష్టితో స్పందించాలని కలెక్టర్(Collector) అన్నారు. గోల్డెన్ హావర్‌లో అందించిన సాయం మనిషి ప్రణాలను కాపాడుతుందని ప్రాణం(Pranam) కంటే విలువైనది మరేమీ లేదని అన్నారు. కలెక్టర్ మానవతా స్పందనను చూసి అక్కడ చేరిన ప్రజలు ప్రశంసించారు. ప్రజలకు చేరువైన అధికారిగా ఆయన ప్రవర్తన మరోసారి వెలుగులోకి వచ్చింది.

Leave a Reply