20వేల క్యూసెక్కుల నీటి విడుదల


సూర్యాపేట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నడంతో మూసీ నదికి వరద పోటెత్తింది. ప్రస్తుతం 2677 క్యూసెక్కుల నీరు నదిలో వచ్చి చేరుతుంది. ఇంకా భారీగా నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇన్ఫ్లోకు తగ్గాట్టుగా నీరును విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లను నాలుగు అడుగుల మేరకు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.


