రేపటి నుంచి చండీగఢ్ లో సీపీఐ మహాసభలు

రేపటి నుంచి చండీగఢ్ లో సీపీఐ మహాసభలు
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపు
( న్యూఢిల్లీ, -ఆంధ్రప్రభ ప్రతినిధి) : దేశంలోని యువత రాజకీయాల్లోకి(into politics) రావాల్సిన అవసరం ఉందని సీపీఐ పార్టీ(the CPI party)జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి దేశంలో బీజేపీ రాజకీయాలు(BJP politics) దారుణంగా మారాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను కంట్రోల్ చేస్తుందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా సెబీ అదానీ గ్రూప్ కి కేంద్రం క్లీన్ చిట్ ఇచ్చిందని తెలిపారు. అలాగే, అండమాన్ నికోబర్ దీవులను(Andaman and Nicobar Islands) ఆదానికి అప్పగించారన్నారు.
దేశంలోని ఆదానికి మద్దతుగా ప్రధాని మోడీ నిలుస్తున్నారన్నారు. ఆదానికి వచ్చే ఆదాయం…సగటు కా వచ్చే ఆదాయం(Income) పోల్చి తలసరి ఆదాయం లెక్కగడతారా? అని ప్రశ్నించారు. రేషన్ బియ్యం తినేవారు లేరని రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నం జరుగుతుందన్నారు. రేషన్ బియ్యం అమ్మేవారిని(ration rice sellers) పట్టుకోకుండా రేషన్ కార్డులు తొలగించాలని చూస్తున్నారని విమర్శించారు.సెల్ ఫోన్లు(cell phones), కార్లు పెరిగాయన్నారు. ఫుట్ పాత్ పై పడుకునే వాడు సెల్ ఫోన్ వాడుతున్నారని తెలిపారు. ఫోన్ వాడినంత మాత్రాన పేదరికం లేనట్లా? అని నారాయణ ప్రశ్నించారు.
మన పోరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్(Bangladesh), శ్రీలంకలో అవినీతి, నిరుద్యోగం పెరిగి యువత తిరగబడ్డారని చెప్పారు. చండీగఢ్ రేపటి నుంచి లో ఐదు రోజుల పాటు ఐ జాతీయ మహా సభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సభలకు దేశవ్యాప్తంగా 750 మంది ప్రతినిధులు హాజరావుతారని పేర్కొన్నారు. ముఖ్యంగా బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై(BJP’s anti-people policies) జాతీయ మహా సభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. సీపీఐ లో 75 ఏళ్ల వయోపరిమితి అమలుపై సీపీఐ మహాసభల్లో చర్చిస్తామని నారాయణ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
