హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటరైంది. మొత్తం 29 మంది సినీ సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది.
హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ వారిపై కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కారణంగా గతంలో ప్రముఖ సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖిలతోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.. నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్ కేసులు నమోదు అయ్యాయి.అలాగే.. శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ కేసుల ఆధారంగా ఇప్పుడు ఈడీ వారిపై కేసు నమోదు చేసింది. వీరందరినీ పీఎమ్ఎల్ఏ కింద విచారణ చేయనుంది. విచారణ సందర్భంగా అందరి స్టేట్మెంట్స్ ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు. దీంతో ఏం జరుగుతుందో ఏమోనని టాలీవుడ్ లో టెన్షన్ నెలకొంది.