కరీమాబాద్, జూన్ 26 (ఆంధ్రప్రభ) : యువత మత్తు వదిలితేనే భవిష్యత్తు ఉంటుందని వరంగల్ ఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ యాదగిరి గౌడ్ (Yadagiri Goud) అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని రైల్వే ప్రయాణికులకు వరంగల్ (Warangal) ఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ యాదగిరి గౌడ్, జీఆర్పీ పోలీసుల ఆధ్వర్యంలో రైల్వే ప్రయాణికులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్తు వదిలితేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. మత్తు పదార్థాలను అరికట్టడానికి పోలీసుల (police) తో పాటు ప్రజలు కూడా ప్రయత్నించాలన్నారు. మత్తు అనేది యువతకు హాని కలిగించే పదార్థమని, వాటికి దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు, సమాజ సేవకులు ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్ స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ ఎం.విరావు, జీఆర్పీ సిబ్బంది పాల్గొన్నారు.