Bhupalpalli | ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి (Lakshma Reddy Palli) గ్రామంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓద్దుల రాం రెడ్డి (46) (Oddula Ram Reddy) తన పొలంలో ట్రాక్టర్ (Tractor) కల్టివేటర్ కొడుతుండగా… ట్రాక్టర్ అదుపుతప్పి తలకిందులుగా బోల్తా పడింది. ట్రాక్టర్ మీద పడడంతో రాంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply