జిన్నారం ఆంధ్ర ప్రభ – సంగారెడ్డి జిల్లా (Sangareddy ) జిన్నారం మండలం (Jinnaram) కాజిపల్లి గ్రామంలో ఉన్న బిల్వాని కంకర క్రెషర్లో టిప్పర్ (Tipper) విద్యుత్ వైర్లకు తగిలి టిప్పర్ దగ్ధమయ్యాడు.. ఈ ఘటనలో డ్రైవర్ (Driver ) మృతి చేందాడు . కాగా, టిప్పర్ ట్రాలీ పైకి ఉండడంతో అలాగే వాహనం ముందుకు కదలడం తో హైటెన్షన్ విద్యుత్ వైర్లు టిప్పర్ కు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . టిప్పర్ పూర్తిగా దగ్ధం కాగా అందులో ఉన్న డ్రైవర్ రాం సుజన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మధ్యప్రదేశ్ (Madyapradesh ) కు చెందిన వ్యక్తి స్థానికులు తెలిపారు ప్రమాద ఘటనపై ఐడీఎబొల్లారం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు
Fire | హెచ్ టి వైర్లు తగిలి టిప్పర్ దగ్ధం – డ్రైవర్ మృతి
