యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా యాదగిరిగుట్టలో ఆదివారం ఉదయం ఆలయ నిర్వాహకులు గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఆలయ ఈఓ వెంకట్ రావు ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణను ప్రారంభించగా, భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.ఆధ్యాత్మిక సంస్థలు, భక్త సమాజాలకు చెందిన వారు ఉత్సాహంగా పాల్గొని గోమాత, జాతీయ పతాకాలతో భక్తులు కొండచుట్టూ ప్రదక్షిణ చేశారు.
అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. పాతగుట్ట క్షేత్రంలోనూ నరసింహస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కొండపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక, సంగీత, భజన, కూచిపూడి ప్రదర్శనలు భక్తులను అలరించాయి.