మక్తల్, మే 9 (ఆంధ్రప్రభ) : మక్తల్ పట్టణంలో రూ.50కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 150పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఇవాళ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి పరిశీలించారు. మక్తల్ పట్టణ శివారులోని పంప్ హౌస్ వద్ద జరుగుతున్న ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన ఏఈ సాయి, కాంట్రాక్టర్ రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన ఆసుపత్రి భవన నిర్మాణ నమూనాను పరిశీలించి నిర్మాణపనులు ఎప్పటిలోగా పూర్తవుతాయి.. వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పనులను త్వరితగతిన చేపట్టి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. నిర్ణీత సమయంలోగా నిర్మాణ పనులను పూర్తి చేసి వైద్య సేవలు అందించేందుకు అందుబాటులోకి తీసుకురావలసిందిగా అధికారులను కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంబడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్, డైరెక్టర్లు పసుల రంజిత్ రెడ్డి, సాలంబిన్ ఉమర్ బస్రవి, అంజి, కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్, కోళ్ల వెంకటేష్, బోయ రవికుమార్, కావలి తాయప్ప, బోయ వెంకటేష్, కట్ట వెంకటేష్, సిఎన్.మూర్తి, వాకిటి శ్యామ్, తదితరులున్నారు.