నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. జిల్లాలోని దోమలపెంట గ్రామంలో అర్ధరాత్రి ఏకంగా ఇళ్ల మధ్యనే చిరుతపులి సంచరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరుత పులి నడుచుకుంటూ వెళుతుంటే పక్కనే ఉన్న ఇంట్లో మనుషులు కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారంలో మూడుసార్లు గ్రామంలో చిరుతపులి సంచరించిందని గ్రామస్థులు చెబుతున్నారు. చిరుత సంచారంతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నామని చెబుతున్నారు. తక్షణమే ఫారెస్ట్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Nagar Kurnool | దోమలపెంటలో చిరుత సంచారం
