Hyderabad | అపరిశుభ్ర ఆహార పదార్థాల స్వాధీనం
Hyderabad | అపరిశుభ్ర ఆహార పదార్థాల స్వాధీనం
తాడ్బన్లోని పరాఠా యూనిట్లో తనిఖీలు నిర్వహించిన హెచ్-ఫాస్ట్ అధికారులు
నాసిరకం నిర్వహణ, గడువు వివరాల్లో అక్రమాలు గుర్తించి కేసు నమోదు దిశగా చర్యలు
Hyderabad | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఆహార తయారీ కేంద్రాలపై హైదరాబాద్లో అధికారులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాడ్బన్ ప్రాంతంలోని ఓ పరాఠా తయారీ యూనిట్పై హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం ఆకస్మికంగా దాడి చేసి పలు అవకతవకలను గుర్తించింది. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార తయారీతో పాటు ప్యాకేజింగ్లో నిబంధనల ఉల్లంఘన వెలుగులోకి రావడంతో సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
హెచ్-ఫాస్ట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పరాఠా యూనిట్లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, ఆహార పదార్థాలను సరైన విధంగా నిర్వహించకపోవడం గుర్తించారు. అంతేకాకుండా ప్యాకేజింగ్పై ముందస్తు తేదీలు ముద్రించినట్లు కూడా అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ కోసం వాటిని బహదూర్పురా పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఘటనపై సంబంధిత శాఖలు దర్యాప్తు చేపట్టగా, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే ఆహార తయారీ, నిల్వ, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఆహార భద్రత నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.

