TG | ఆదిలాబాద్ కలెక్టర్ కు ఆస్పిరేషనల్ పురస్కారం..!

అవార్డుతో సత్కరించిన ప్రధాని మోదీ..!
ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు జాతీయస్థాయిలో అత్యున్నత గౌరవం దక్కింది. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ నార్నూర్ మండలానికి జాతీయస్థాయి ఆస్పిరేషనల్ పురస్కారాన్ని కలెక్టర్ రాజార్షి షాకు అందజేశారు. బ్లాక్ ఆస్పిరేషన్ ప్రోగ్రాంలో భాగంగా దేశంలోని మారుమూల ప్రాంతాలైన 426 బ్లాక్ లను ఎంపిక చేయగా, వాటిలో టాప్ -5 లో నార్నూర్ మండలం ఉన్నత స్కోరును సాధించింది. పరిపాలన విభాగంలో అద్భుత ప్రగతి సూచికలకు అనుగుణంగా ప్రతి ఏటా అత్యున్నత పురస్కారాన్ని కేంద్రం అందిస్తోంది. ‘ ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారం’- 2024 కింద తెలుగు రాష్ట్రాల నుండి ఆదిలాబాద్ కలెక్టర్ అరుదైన అవార్డును అందుకోవడం విశేషం.

పాలన అంశాల్లో నార్నూర్ అద్భుతమైన ప్రగతి..!
ప్రగతిశీల బ్లాక్ ప్రోగ్రాం కింద కిందటేడాది దేశంలోని మారుమూల ప్రాంతాల్లోlr నవంబర్ 26 బ్లాక్ లను కేంద్రం ఎంపిక చేసింది. కేంద్ర రాష్ట్రాల నిధులతో పాటు సి ఎస్ ఆర్ నిధులను ఈ మండలానికి వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ వేగిర పరిచారు. క్షేత్రస్థాయిలో మారుమూల గిరిజన గ్రామాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుపరిచారు. జాతీయస్థాయి ప్రగతి సూచికల్లో ఐదవ స్థానాన్ని, తెలుగు రాష్ట్రాల్లో నార్నూర్ మండలం ఆస్పిరేషనల్ అవార్డు కింద మొదటి స్థానంతో గౌరవం దక్కించుకొని అరుదైన అవార్డును సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

డిజిటల్ పాలనలో అద్భుత ప్రగతి..!
ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కలెక్టర్ రాజార్షి షా నార్నూర్ మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. డిజిటల్ పాలనరంగంలో నార్నూర్ బ్లాక్ ముందు వరుసలో నిలవడమే గాక , మహిళా సాధికారిక, సేంద్రీయ పద్ధతిలో ఆదాయం సమకూరే సాగు పంటలు, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డుల నిర్వహణ తో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మా ఊరు.. మా పాఠశాల అనే నినాదంతో కొత్త ఒరవడిని పాఠశాలలో ప్రవేశపెట్టి పోషక విలువలు ఆహారపు అలవాట్ల గురించి విద్య బోధన సాగించారు. నీటి కుంటలు, చెక్ డ్యామ్ లతో జలవనరుల అభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. అంతేగాక చిన్నారులు, గర్భిణులు, మహిళల రక్తహీనతను దూరం చేసేలా పౌష్టికాహారం అందేలా కలెక్టర్ రాజార్షి షా కృషి చేశారు. అద్భుతమైన ప్రగతి సూచికలే జాతీయస్థాయి పురస్కారానికి నార్నూర్ మండలం ఆస్పిరేషనల్ అవార్డు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కలెక్టర్ అందుకోవడం గమనార్హం.

ప్రజా ప్రతినిధుల సహకారం వల్లే నాకు అవార్డు.. కలెక్టర్ రాజార్షి షా.
జాతీయస్థాయిలో అత్యున్నత పురస్కారం అందడం ఆనందంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు నార్నూర్ మండలంలో పకడ్బందీగా అమలు చేయడానికి ప్రజా ప్రతినిధులు పూర్తిగా సహకరించారు. అద్భుత ప్రగతి సూచీలతో ఆస్పిరిషనల్ అవార్డు ప్రధాని మోదీ చేతుల మీదుగా అందుకోవడం సంతోషంగా ఉంది. మున్ముందు వెనుకబడిన జిల్లాకు మరిన్ని అవార్డులు సాధించేలా కృషి చేస్తా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *