ఉట్నూర్ /ఇంద్రవెల్లి, మార్చి 7 (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్లోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలో జరుగుతున్న రెండు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను శుక్రవారం అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో పాటు ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ లు సందర్శించి విద్యార్థులు రాస్తున్న ఇంగ్లీష్ పరీక్ష విధానాన్ని పరిశీలించారు.
పరీక్ష సెంటర్ సీఎస్ లతో ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారని రికార్డులను పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, ఇలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.