AP | కాకినాడ‌లో వైసిపికి మ‌రో షాక్ – జ‌డ్పీ వైస్ ఛైర్మ‌న్ బుర్రా అనుబాబు ఫ్యాన్ కు బై బై


రేపు జ‌న‌సేన పార్టీలో చేర‌నున్న నేత

కాకినాడలో వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన చేశారు. రేపు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తో కలిసి జనసేనలో చేరనున్న‌ట్లు వెల్ల‌డించారు అనుబాబు.

రేపు జ‌న‌సేన‌లో చేర‌నున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు
తాజాగా… పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ఎంపీపీలు ,జెడ్పిటిసిలు, 25 మంది సర్పంచ్ లు, 20 మంది ఎంపీటీసీలు వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే 14 మంది పిఠాపురం గొల్లప్రోలు కు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. రేపు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తో కలిసి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో వారంతా జనసేనలో చేరనున్నారు .

Leave a Reply