AP | పోసాని, రాంగోపాల్ వర్మలకు హైకోర్టులో ఊరట

వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, వైసీపీ సానుభూతిపరుడు, రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట లభించింది. రాంగోపాల్ వర్మకు సీఐడీ జారీ చేసిన నోటీసులపై స్టే విధిస్తూ.. న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ కోర్టు. ‘క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు’ అనే సినిమాపై గతంలో ఫిర్యాదులు అందగా.. విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది ఏపీ సీఐడీ. అయితే… ఈ కేసుని కొట్టివేయాలని కోరుతూ.. హైకోర్టులో వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ తరుణంలోనే… ఈ పిటిషన్‌ని విచారించింది హైకోర్టు.. వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఊరటనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. త‌దుప‌రి చ‌ర్యలు 6 వారాల వరకు నిలిపివేయాలని సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది.

అలాగే… పోసాని కృష్ణమురళి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు చోట్ల నమోదైన కేసుల్లో ఇంకా పిటి వారెంట్లు జారీ చేయలేదని కోర్టుకు తెలిపింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం.

ఈ తరుణంలోనే… విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో… ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. ఇక తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *