గుంటూరు – తెలుగుదేశం పార్టీ నేడు ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఘనం నిర్వహించుకుంటున్నది.. 43వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆ పార్టీకి జనసేన అధినేత, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు..
“1982 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి కీ. శే శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది. నాటి నుండి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, ప్రజల పక్షాన నిలిచింది. 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్, రాష్ర్ట అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, ఇతర టిడిపి నేతలు, కార్యకర్తలకు 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు..