హైదరాబాద్ – ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో నేడు జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ రెండో వికెట్ గా ట్రావిస్ హెడ్ ను కోల్పోయింది . ట్రావీస్ చేసిన 67 పరుగులలో 3 సిక్సర్లు . 9 ఫోర్లు ఉన్నాయి. హెడ్ వికెట్ తుషార దేష్ పాండే కి దక్కింది .
ముందుగా . టాస్ ను గెలుచుకున్న ఆర్ ఆర్ కెప్టెన్ రియాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ట్రావిస్ హెడ్ తో కలిసి బ్యాటింగ్ ఆరంభించిన అభిషేక్ శర్మ దూకుడుగా ఆడాడు. 24 పరుగులు చేసిన శర్మ స్పిన్నర్ తీక్షణ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.ప్రస్తుతం ఇషాన్ కిషన్ 35 , నితీష్ కుమార్ రెడ్డి 15 పరుగులతో క్రేజ్ లో ఉన్నారు. 11 ఓవర్లలో రెండు వికెట్లు నష్ట పోయి 147 పరుగులు చేసింది
ఇక సన్ రైజర్స్ జట్టు లోకి అనూహ్యంగా కొత్త కుర్రాడు అనికేత్ వర్మ చోటు దక్కించుకున్నాడు. ఇక సిమర్జీత్ సింగ్ కూడా టీమ్ ఎలెవన్ లో. ఉన్నాడు
సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(c), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI:యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (సి), ధ్రువ్ జురెల్ (w), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, ఫజల్హక్ ఫరూఖీ