బెంగళూరులో చెన్నై జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సబీకి మంచి ఆరంభం దక్కింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… ఓపెనర్లు ధనాధన్ బ్యాటింగ్ తో సీఎస్కే బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు.
ఓపెనర్ జాకబ్ బెథెల్ (33 బంతుల్లో 55) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అయితే, 9.5వ ఓవర్లో పతిరాణ బౌలింగ్ క్యాచ్ ఔటయ్యాడు. ఇక మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ (26 బంతుల్లో 42) దంచికొడుతున్నాడు. దీంతో బెంగళూరు జట్టు ఒక 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, పడిక్కల్ ఉన్నారు.
బెథెల్ మేయిడిన్ ఫిప్టీ !
ఆర్సీబీ తరుఫున విరాట్ తో పాటు ఓపెనర్ గా బరిలోకి దిగిన జాకబ్ బెథెల్ ఐపీఎల్ లో తొలి అర్ధశతకం నమోదు చేశాడు. నేటి మ్యాచ్ లో కేవలం 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఈ యంగ్ స్టార్.
విరాట్ అకౌంట్లో మరోఅరుదైన రికార్డ్.
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ గా.. ఒకే జట్టు తరుఫున 300కు పైగా సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్మన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈరోజు బెంగళూరు వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో.. పేసర్ ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్లో విరాట్ కోహ్లీ రెండు సిక్సర్లు బాదాడు. దాంతో ఆర్సీబీ తరుఫున (ఒకే జట్టు తరుఫున) 300-సిక్సర్లు బాదిన ప్లేయర్ గా విరాట్ రికార్డు సృష్టించాడు.