ఖాట్మండులోనూ ఢిల్లీ తరహాలోనే..

రన్వే లైటింగ్ వ్యవస్థలో సమస్యలు
ఖాట్మండు: (నవంబర్ 9) రన్వే లైటింగ్ వ్యవస్థలో సమస్యలు తలెత్తడంతో ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం విమాన కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. విద్యుత్ సమస్య కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమానాల టేకాఫ్లు, ల్యాండింగ్లు ప్రభావితమయ్యాయని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA) ప్రతినిధి రిజి షెర్పా తెలిపారు. ఈ సమస్య కారణంగా రెండు దేశీయ, మూడు అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించారు. ఖతార్ ఎయిర్వేస్ విమానాన్ని ఢాకాకు, కొరియన్ ఎయిర్ ఢిల్లీకి, ఫ్లై దుబాయ్ను లక్నోకు దారి మళ్లించారని షెర్పా తెలిపారు.
