భారత్ ఎదురుదాడితో బిత్తర చూపులు
పాక్ కు చైనా, అమెరికా మొట్టికాయాలు
అణ్యాయుధ వినియోగ కమిటీ సమావేశాన్ని రద్దు చేసుకున్న పాక్
దౌత్య పరమైన చర్చలకు రెడీ అంటూ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి పిలుపు
ఇస్లామాబాద్ – ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం కానీ యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులపై దాడి చేస్తే.. పాక్ ఏకంగా యుద్ధానికి కాలు దువ్వుతూ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. సామాన్య పౌరుల ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకొని పిచ్చిగా ప్రవర్తిస్తోంది. అది సరిపోదన్నట్లు ఫైటర్ జెట్లతో డ్రోన్లతో క్షిపణులతో భారత సైనిక స్థావరాలపై దాడికి యత్నిస్తోంది. వీటన్నింటిని ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికోడుతోంది. దీంతో ఇక ఆపేద్దాం అంటూ భారత్ ముందు పాక్ కాళ్లబేరానికి వచ్చింది. భారత్ దూకుడుతో సీన్ మారిపోయింది. ఉద్రిక్తతలు తగ్గించుకుందామని భారత్కు సంకేతాలు పంపుతోంది పాక్.
ఈ క్రమంలోనే పాక్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో విదేశాంగమంత్రి ఇషాక్దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఒత్తిడి, పౌరుల నుంచి వ్యతిరేకతతో పాక్ యూటర్న్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అణ్వాయుధాల వినియోగం కోసం నేడు జరగాల్సిన నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం రద్దు చేసుకుంది. భారత్ తో దౌత్యపరమైన చర్చలకు సిద్దమంటూ విదేశాంగమంత్రి ఇషాక్దార్ ప్రకటించారు. యద్దం వద్దంటూ అమెరికా సహా పలుదేశాల నుంచి పాక్పై ఒత్తిడి వస్తోంది. అలాగే భారత్కు ప్రపంచదేశాల మద్దతు పెరుగుతోంది. అటు పాక్ దాడులను తిప్పికొట్టడంలో తగ్గేది లేదన్నారు జైశంకర్. శాంతి నెలకొల్పడంలో భారత్ ముందుంటుందన్నారు. అలాగే భారత్-పాక్ చర్చించుకోవాలని అమెరికా కోరుతోంది. ఈ మేరకు ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రులకు ఆమెరికా ప్రతినిధి పోన్ చేసి మాట్లాడారు.. అలాగే చైనా సైతం యుద్దం వద్దంటూ పాక్ కు హితవు పలికింది.. ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలు తగ్గించేందుకు తామ మధ్య వర్తిత్వం వహించేందుకు సిద్ధమంటూ చైనా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పాక్ చర్చలంటూ పిలుపు ఇస్తున్నది..