RISHAB PANTH | రెండో ప్లేయర్గా పంత్ రికార్డ్

- భారత్- సౌతాఫ్రికా రెండో టెస్టుకు కెప్టెన్గా పంత్
- ధోనీ తర్వాత ఆ ఘనత సాధించిన ప్లేయర్గా రికార్డ్
RISHAB PANTH | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గువాహటి వేదికగా భారత్- సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు జరుగుతోంది. రెగ్యులర్ కెప్టెన్ గిల్ గాయపడటంతో ఈ టెస్టుకు దూరమయ్యాడు. ఆయన ప్లేస్లో కెప్టెన్గా పంత్ వ్యవహరిస్తున్నాడు. భారత్కు టెస్టుల్లో సారథ్యం వహించిన 38వ కెప్టెన్గా నిలిచాడు. దీంతో పంత్ అరుదైన రికార్డు సాధించాడు. టెస్టుల్లో భారత్ జట్టుకు సారథ్యం వహించిన రెండో వికెట్ కీపర్, బ్యాటర్గా నిలిచాడు. పంత్ కంటే ముందు మహేంద్రసింగ్ ధోనీ మాత్రమే (వికెట్ కీపర్, బ్యాటర్) టీమ్ఇండియాను టెస్టుల్లో నడిపించాడు. 100ఏళ్ల చరిత్ర ఉన్న భారత టెస్టు జట్టుకు ఈ ఇద్దరు వికెట్ కీపర్లే కెప్టెన్సీ వహించిన ఘనత అందుకున్నారు.
కెప్టెన్గా ఎంపిక కావడంపై పంత్ మాట్లాడాడు. ఇది తనకు ఓ గౌరవం అని చెప్పాడు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు అని చెప్పాడు. కొన్నిసార్లు సంప్రదాయబద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం బాగుంటుందని, మరికొన్నిసార్లు కొత్తగా ట్రై చేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చన్నారు. కానీ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం తెలిసి ఉండాలన్నారు. ఆటను ఆస్వాదిస్తూ జట్టు కోసం నేను చేయాల్సింది వంద శాతం చేస్తానని పంత్ పేర్కొన్నాడు.
