NEWS@12:00 P.M | 14 జూలై 2026 ముఖ్యాంశాలు
NEWS@12:00 P.M | 14 జూలై 2026 ముఖ్యాంశాలు
Rao Bahadur Movie | ‘ప్రతి సినిమా ప్రేమికుడు తప్పక చూడాల్సిన చిత్రం’.. సందీప్ రెడ్డి వంగా
విభిన్న కథాంశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్ మహా తెరకెక్కించిన తాజా చిత్రం ‘రావు బహదూర్’ ప్రస్తుతం ప్రేక్షకుల ముందుంది. విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదల అనంతరం మిశ్రమ స్పందనను అందుకుంటున్నప్పటికీ.. సినీ ప్రముఖుల నుంచి మాత్రం ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న వెంకటేశ్ మహా–సత్యదేవ్ కాంబినేషన్పై ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కథ, పాత్రల రూపకల్పనలో తనదైన శైలిని కొనసాగించిన వెంకటేశ్ మహా మరోసారి వైవిధ్యమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Hyderabad | భద్రతా వైఫల్యంపై కేసు..
హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ) పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లులు మాల్లో గన్ కలకలం చోటుచేసుకుంది. మాల్ పార్కింగ్ ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.
Kurnool-Double-Murder : ప్రతీకారం..ఫలితం,,Andhra Prabha Crime Analysis
ఒక్క క్షణం ఆవేశం… జీవితాంతం విషాదంగా మారింది. అనుమానం ప్రతీకారంగా మారింది.. ప్రతీకారం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది.. చట్టం ఉరిశిక్ష విధించింది.. చివరకు నేరానికి పాల్పడిన వ్యక్తి జైలులోనే ఆత్మహత్య చేసుకోవడంతో ఈ విషాద గాథ ముగిసింది. కర్నూలులో సంచలనం సృష్టించిన ఈ ఘటన కుటుంబ విభేదాలు, మనస్పర్థలు, మోసాలు, అనుమానాలకు హింస ఎన్నటికీ పరిష్కారం కాదనే చేదు సత్యాన్ని మరోసారి సమాజానికి గుర్తు చేసింది. క్షణికావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం రెండు కుటుంబాలను శాశ్వత విషాదంలోకి నెట్టడమే కాకుండా, నేరం చేసిన వ్యక్తి జీవితాన్నీ అర్థాంతరంగా ముగించింది. కోపం క్షణికమే… కానీ ఆవేశంలో చేసిన నేరం జీవితాంతం వెంటాడుతుంది; చట్టం శిక్షిస్తుంది… కుటుంబాలు మాత్రం జీవితాంతం ఆ శిక్షను అనుభవిస్తూనే ఉంటాయి. ఈ విషాద ఘటన యువతకు, కుటుంబాలకు ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తోంది.
Palnadu Tragedy | ఇద్దరు చిన్నారులను చంపి.. తల్లి ఆత్మహత్య
పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో భారతి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో ఒక సూసైడ్ లెటర్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అందులో “నా చావుకు ఎవరూ కారణం కాదు” అని భారతి రాసినట్లు సమాచారం. అయితే ఆ లేఖలోని అంశాల ప్రామాణికతను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Sensex | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్టుబడిదారులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా బలహీనపడటంతో మార్కెట్లపై మరింత ఒత్తిడి పెరిగింది.
Psychologist | మనసును వినండి.. నిపుణుడిని కలవండి!
“శరీరానికి గాయం కనిపిస్తుంది… కానీ మనసుకు కలిగిన గాయం కనిపించదు. అందుకే మానసిక ఆరోగ్య పరిరక్షణలో సైకాలజిస్టుల పాత్ర అమూల్యమైనది.” ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది. అయితే మన సమాజంలో ఇప్పటికీ మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం లభించడం లేదు. శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించే వారు, మనసు బాధపడుతున్నప్పుడు మాత్రం నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం జూలై 14న జాతీయ సైకాలజిస్ట్ ప్రశంసా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
Rtgs-Cctv360 : గుఢాచారి 360 Andhra Prabha Crime Story
ఈ నెల ఒకటో తేదీ.. బాపట్ల జిల్లా చీరాల. చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించే తల్లి. తన ఆరునెలల చంటిబిడ్డను పొత్తిళ్లలు పెట్టుకుని ఫుట్పాత్ మీద ఓ దుకాణం ముందు నిద్రిస్తోంది. తెల్లవారు జామున ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ఓ ఆగంతుకుడు ఆమె చంటిబిడ్డను ఎత్తుకెళ్లాడు. ఆమె కన్నీరు మున్నీరైంది. బాపట్ల పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. బిడ్డను ఎత్తుకెళ్లిన నిందితుడ్ని పట్టుకోవడానికి ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్యవస్థ సహకారం కోరారు. బిడ్డను ఎత్తుకెళ్లిన వ్యక్తి కదలికలను ఏఐ ఆధారిత కెమెరాల ద్వారా జల్లెడపట్టి 24 గంటల్లోపే నిందితుడ్ని పట్టుకునేలా ఆర్టీజీఎస్ రియల్ టైమ్ అలెర్టులను పోలీసులకు పంపింది. అపహరణకు గురైన బాబును పోలీసులు తీసుకొచ్చి మళ్లీ ఆ తల్లి ఒడికి చేర్చారు. బిడ్డకోసం తల్లడిల్లిన ఆ తల్లి మళ్లీ పొత్తిళ్లలో తన బిడ్డను చూసి మురిసిపోయింది. ఆనందాశ్రువులు కార్చుతూ పోలీసులకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపింది.
