డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నారు. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటి వరకు రిలీజ్ చేసిన రెండు టీజర్లు, పాటలు సినిమా మీద అంచనాల్ని పెంచేసాయి.
కాగా, కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటానని విష్ణు మంచు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా విష్ణు భక్త కన్నప్ప సొంతూరికి వెళ్లారు. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలంలోని ఊటుకూరు గ్రామానికి వెళ్లారు. గ్రామస్థులు, ఆలయ సిబ్బంది విష్ణు మంచుకి, కన్నప్ప టీంకు ఘనంగా స్వాగతం పలికారు.
అక్కడ కన్నప్ప స్వగృహాన్ని సందర్శించారు. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాన్ని అభివృద్ది చేస్తానని కూడా విష్ణు మంచు హామీ ఇచ్చారు.