India Test Match | మొదటి సెషన్‌లో భారత్‌దే ఆధిపత్యం

India Test Match | మొదటి సెషన్‌లో భారత్‌దే ఆధిపత్యం

ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్
రాహుల్, సాయి సుదర్శన్ నిలకడగా బ్యాటింగ్

India Test Match | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: భారత పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ జట్టు శనివారం టీమిండియాతో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో ఉన్న మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా నిలిచింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి సెషన్‌లో భారత బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. లంచ్ విరామ సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది.

భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 24 పరుగులు చేసి మహ్మద్ సలీమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ జట్టును ఆదుకుంటూ నిలకడగా బ్యాటింగ్ చేశారు. లంచ్ సమయానికి కేఎల్ రాహుల్ 37 పరుగులతో, సాయి సుదర్శన్ 32 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు.

Leave a Reply