ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రభ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిలో దేవస్థానంలో చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులు నదీ విహారం చేశారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయం నుండి దేవ దేవీరిలకు పవిత్ర కృష్ణానదిలో నదీ విహారం నిర్వహించుటకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లే కృష్ణమ్మ ఒడిలో విహరింప చేశారు.
వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాలు నడుమ స్వామి, అమ్మ వార్లకు నదీ విహారము నిర్వహించటకు మల్లేశ్వర స్వామి ఆలయం నుండి బయలుదేరిన బృందం మహామండపం వద్దనుండి కూచిపూడి నృత్య కళాకారులు, తప్పెట్లు, కోలాటం, భజన సంకీర్తనలతో కోలాహలంగా దుర్గా స్నానఘాట్ చేరింది. పుష్పాలంకరణ చేసిన ఫంటు పై స్వామి, అమ్మవార్లను అధిరోహింపజేసిన అనంతరం కృష్టానదిలో నదీవిహారం ప్రారంభం అయింది.
కళ్యానోత్సవ ఆది దంపతులను కృష్ణా నదిలో విహరింపజేశారు. కృష్ణమ్మ నదిలో విహరిస్తున్న స్వామి వారిని అమ్మవారిని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఘాటుకు చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య వి.శివ ప్రసాద్ శర్మ, దేవస్థానం కార్యనిర్వాహక ఇంజనీర్ వైకుంఠరావు,దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి కొచ్చెర్ల గంగాధర్,ఆలయ పర్యవేక్షకులు నరసింహరాజు, చందు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





