Davos | యూఏఈ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

Davos | యూఏఈ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
Davos | ఆంద్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన సీఎం చంద్రబాబు.. యూఏఈ ఆర్థిక మంత్రి అల్ మార్రీతో భేటీ అయ్యారు. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ (park) ఏర్పాటు, ఏపీ-యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్య బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్లో యూఏఈతో కలిసి పనిచేసేందుకు అంగీకారం కుదిరింది. యూఏఈకి చెందిన 40 సంస్థలు ఏపీలో ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని అల్ మార్రీ పేర్కొన్నారు. ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చ జరిగింది.
