మార్పు దిశలో బ్యాంకింగ్.. డిజిటల్‌ పేమెంట్ల బాట పడుతున్న మహిళలు : అనూరాధా అగర్వాల్‌

హైదరాబాద్ (ఆంధ్రప్రభ) : భారతదేశంలో డిజిటల్‌ ఫైనాన్స్‌ యవనిక చాలా వేగంగా మార్పు చెందుతూ వచ్చిందని, ప్రత్యేకించి తల్లులు ఈ సరికొత్త వైఖరి మీద ప్రభావాన్ని చూపేవారిగా ఆవిర్భవిస్తున్నారని అమెజాన్‌ పే సీఎంఓ అండ్‌ యూజర్‌ గ్రోత్‌ డైరెక్టర్‌ అనురాధ అగర్వాల్‌ అన్నారు.

అత్యవసరమైన వాటిని మేనేజ్‌ చేయటం మొదలుకుని, భారీ ఖర్చుల కోసం ప్లాన్‌ చేయటం వరకు, తమకు గల సాంప్రదాయ స్వరూపంలోని ఫైనాన్షియల్‌ పాత్రను వారు డిజిటల్‌ ప్రపంచంలోకి విస్తరింపజేశారన్నారు. ప్రస్తుతం పురుషులు, మహిళలు తమ తమ లావాదేవీల్లో 72శాతం వరకు లావాదేవీల్లో డిజిటల్‌ చెల్లింపులను ఉపయోగిస్తున్నారని, హౌ అర్బన్‌ ఇండియా పేస్‌ (భారతదేశపు పట్టణ ప్రాంతాలు ఎలా చెల్లిస్తున్నాయి) అనే తమ నివేదిక చెబుతోందన్నారు.

అమెజాన్‌ పే ద్వారా, ఆఫ్‌లైన్‌ పేమెంట్లు, బిల్లుల చెల్లింపులు, సొమ్ము బదిలీల వంటి దైనంది అవసరాల కోసం ఎక్కువగా యూపీఐని ఉపయోగించటం జరుగుతోందని తాము గమనించామన్నారు. నిజానికి తమ యూజర్లలో, కిరాణా సామాగ్రులు, ఫ్యాషన్‌, సౌందర్య సాధనాలు, ప్రయాణాల కోసం బుకింగుల వంటి విభాగాలు గణనీయమైన యూపీఐ లావాదేవీలు వాటాను కలిగి ఉండటాన్ని పరిశీలిస్తే, అత్యవసర సామాగ్రులు, గృహావసర సంబంధిత ఖర్చుల కోసం ప్రాధాన్యం దేనికి లభిస్తోందో తెలియవస్తుందన్నారు.

కాగా, ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, భారీ-టికెట్‌ సీజనల్‌ షాపింగ్‌ వంటి విభాగాల్లో క్రెడిట్‌ కార్డ్‌ వాడకం, ప్రత్యేకించి అమెజాన్‌ పే ఐసిఐసిఐ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చెల్లింపు జరుగుతుండటాన్ని గమనించవచ్చన్నారు. అమెజాన్‌ పే ఇండియా మే 25లో పట్టణాల్లో ఉద్యోగస్తులైన మహిళల విషయంలో నిర్వహించి అంతర్గత సర్వే ఒకదానిని అనుసరించి, 95శాతం తల్లులు, తమ గృహావసరాల కోసం జరిపే కొనుగోళ్ళలో 50శాతానికి పైగా కొనుగోళ్ళను డిజిటల్‌ గా జరుపుతున్నట్లు తెలియచేయటం ఆసక్తికరమన్నారు.

వీరిలో 54శాతం మంది తాము, 75 శాతానికి పైగా గృహావసరాల లావాదేవీలను ఆన్‌లైన్‌ లో జరుపుతామని చెప్పారు. టైర్‌2, టైర్‌ 3 శ్రేణి పట్టణాల్లో, డిజిటల్‌ చెల్లింపులను మహిళలు అవలంబించటం పెరగటం అనేది వాడకానికి, నమ్మకానికి, వాటి గురించి ఎంత బాగా తెలిసి ఉన్నది అనే అంశాలతో బాగా ముడిపడి ఉంటుందన్నారు.

మహిళలు, ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో మహిళలు అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ వంటి ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌???స్ట్రమెంట్స్‌ (పిపిఐలు) వంటి తక్కువ-ఎక్స్పోజర్‌ కలిగిన టూల్సుకు ప్రాధాన్యాన్ని ఇస్తున్నారన్నారు. నిజానికి సర్వేలో పాల్గొన్నవారిలో 66శాతానికి పైగా డిజిటల్‌ పేమెంట్‌ సొల్యూషన్లు తమ భరోసాను, వేరొక మీద ఆధార పడనవసరం లేదన్న నమ్మకాన్ని కలిగించినట్లు పేర్కొన్నారు.

అమెజాన్‌ పే లో తాము, కుటు-ంబం ఆర్ధిక వ్యవహారాలను మేనేజ్‌ చేసే తల్లులు చాలా మందికి అవసరమైన వాటిని అడ్రెస్‌ చేసేందుకు ఫీచర్లను అభివృద్ధి చేశామన్నారు. డిజిటల్‌ పేమెంటును అవలంబించటానికి ముఖ్యంగా దోహదం చేయటాన్ని గురించి తమ యూజర్‌ చెప్పినది.. అన్నింటికీ మించి 39శాతం మంది సౌకర్యానికి పెద్దపీట వేస్తారన్నారు.

28శాతం మందిని రివార్డులు, క్యాష్‌బ్యాక్‌ లాభాలు ఆకట్టుకుంటాయన్నారు. అవసరమైన కొనుగోళ్ళపై, ప్రత్యేకించి ఉపకరణాలు, దుస్తులు, ఫ్యామిలీ షాపింగ్‌ వంటి విభాగాల్లో తక్షణ క్యాష్‌బ్యాక్‌ ద్వారా అమెజాన్‌ పే ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్‌ అదనపు విలువను జోడిస్తోందన్నారు.

డిజిటల్‌ అవలంబన, అతిగా ఉండవలసిన అవసరం ఏమీ లేదు. తాను సూచించేది ఏమిటంటే మౌలికమైన వాటితో మొదలు పెట్టండి, తక్కువ-రిస్క్‌ లావాదేవీలైన మొబైల్‌ బిల్లులు కట్టటం లేదా తెలిసిన వ్యక్తికి సొమ్మును పంపటం, వంటి వాటితో ప్రారంభించి, ఆ అనుభవం ఎలా ఉన్నదో గమనించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *