అక్కినేని కుటుంబం ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఇటీవల జరిగిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ నటుడు నాగార్జున ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ప్రధాని మోదీని కలిసిన వారిలో అక్కినేని కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. కాగా, ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
