Agriculture Budget | రూ.48,340 కోట్ల‌తో వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ – అన్నదాత సుఖీభవకు రూ.9,400 కోట్లు కేటాయింపు

వెల‌గ‌పూడి – మొత్తం రూ. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నేడు శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.. ఇందులో అధిక‌భాగం వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు కేటాయించారు . ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ. దేశం, రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారమని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌కు అనుసంధానంగా ఏపీ పురోభివృద్ధి ఉంటుందన్నారు. సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేదే లక్ష్యంగా చెప్పారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.120 కోట్ల విత్తన రాయితీ చెల్లించామని అసెంబ్లీ వేదికగా మంత్రి ప్రకటించారు. 35.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువు సరఫరా చేశామన్నారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్‌ల వినియోగం చేపట్టామని మంత్రి అచ్చెన్న తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని.. అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు మంజూరు చేస్తామని మంత్రి చెప్పారు.

రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌… కేటాయింపుల వివ‌రాలు

ఎరువుల స్టాక్‌ నిర్వహణకు రూ.40 కోట్లు.
ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి రూ.61 కోట్లు.
వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139 కోట్లు.
డ్రోన్ల రాయితీ కోసం రూ.80 కోట్లు.
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219 కోట్లు.
విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు.
రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు.
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ అమలుకు రూ.9,400 కోట్లు.
ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు.
వ్యవసాయ శాఖకు రూ.12,401 కోట్లు.
ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు.
పట్టుపరిశ్రమకు రూ.96.22 కోట్లు.
సహకారశాఖకు రూ.239.85 కోట్లు.
పశుసంవర్థకశాఖకు రూ.1,112.07 కోట్లు.
మత్స్య రంగానికి రూ. 540.9 కోట్లు.

మంత్రి ప్ర‌సంగంలో …

35.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువు సరఫరా చేశాం
35.8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువు సరఫరా చేశాం
వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్‌ల వినియోగం
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు
భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నాం
అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు
గ్రోత్‌ ఇంజిన్లుగా 11 పంటలు
7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *