TG | ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, డీకే అరుణ…

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నారాయణపేట జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని అప్పక్ పల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మహిళా సమాఖ్య సభ్యులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ డీకే అరుణ కనిపించారు. రేవంత్ రెడ్డిపై డీకే అరుణ పలు సందర్భాల్లో విమర్శలు చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఒకే వేదికను పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక, రేవంత్ రెడ్డి, డీకే అరుణ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా పలుమార్లు రేవంత్, డీకే అరుణ నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *