Champions Trophy | బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ డౌన్ .. ష‌మీకి నాలుగో వికెట్

దుబాయ్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.. ష‌మీ బౌలింగ్ తంజిమ్ సున్నా ప‌రుగుల‌కు ఔటయ్యాడు.ఇక ఏడు వికెట్ గా హ‌ర్షిత్ రాణా బౌలింగ్ లో నిషాద్ హుస్సెన్ 18 పరుగులు చేసి ఔట‌య్యాడు.. ప్రస్తుతం తౌహిద్ 91 , అహ్మాద్ లు సున్నా పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.. ఇక బంగ్లాదేశ్ 47 ఓవర్లలోఎనిమిది వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది

ఈ మ్యాచ్ లో ఆరో వికెట్ గా జ‌క‌ర్ అలి 68 ప‌రుగులు చేసి ష‌మీ బౌలింగ్ లో చిక్కాడు.. ఇక 35 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్ లోకి వచ్చిన జకర్ అలి , తౌహిద్ లు బంగ్లా కుప్పకూలకుండా అడ్డుకున్నారు.. ఈ ఇద్దరు కలసి స్కోర్ బోర్డును పరుగు పెట్టించారు.. భారత్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని ఇద్దరు అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు.. ఆరో వికెట్ కి ఇద్దరు 154 పరుగులు జోడించారు
ఇక తొలి సెషన్ లో భారతీయ బౌలర్ల హవా కొనసాగింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో బంగ్లా బ్యాటర్స్ క్రీజులో కుదురుకోనివ్వకుండానే పెవిలియన్ కు చేర్చారు. 35 ప‌రుగుల‌కే అయిదు వికెట్లు ప‌డ‌గొట్టారు.. ఇక బంగ్లా బ్యాటర్స్ లో హసన్ 25 చేయగా, సౌమ్య సర్కార్, శాంటో, ముష్పికర్ లు డకౌట్ అయ్యారు. ఇక హసన్ మీర్జా సైతం 5 పరుగులకే వికెట్ పోగొట్టుకున్నాడు. జకర్ అలి 68 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకూ షమీ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా , అక్షర్, హర్షీత్ రాణాల‌కు రెండేసి వికెట్ లు ద‌క్కాయి.

Leave a Reply