న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ : భద్రాచలం జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. భద్రాచలం ఆదివాసి మహిళలు ‘భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్’ పేరిట బిస్కెట్లు తయారు చేస్తున్నారని, ఆ బిస్కెట్లు హైదరాబాద్ నుంచి లండన్కు కూడా ఎగుమతి అవుతున్నాయని ప్రధాని వెల్లడించారు. ప్రధాని మోదీ ఈ విషయాన్ని ఆదివారం ప్రసారమైన తన మన్ కీ బాత్లో గుర్తుచేశారు.ఈ మహిళలే మూడు నెలల్లో 40 వేల శానిటరీ నాప్కిన్లను తయారు చేసి విక్రయించారని చెప్పారు. వారుని తాను అభినందిస్తున్నానని అన్నారు. 50 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ విధించిన వాళ్లు రాజ్యాంగాన్ని హత్య చేయడంతోపాటు న్యాయ విభాగాన్ని బానిసగా మార్చుకోవాలనుకున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. నాడు జార్జిఫెర్నాండెజ్ను సంకెళ్లతో బంధించారన్నారు. కానీ భారత ప్రజలు శక్తిమంతమైన వారు కావడంతో ఎమర్జెన్సీ తొలగిపోయిందని చెప్పారు. దానిని విధించినవారు ఓడిపోయారని గుర్తుచేశారు.
పరిమిత వనరులతోనే సాధన..
మొరార్జీ దేశాయ్, వాజ్పేయి, బాబూ జగ్జీవన్ రామ్ లాంటి నేతల ప్రసంగాలను మోదీ వినిపించారు. ఎమర్జెన్సీపై పోరాడిన వారిని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఫుట్బాల్ ఆటగాళ్లకు కేంద్రంగా బోడోల్యాండ్ మారిందని అభినందించారు. వారు పరిమిత వనరులతోనే సాధన చేసి అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. దేశంలోని చిన్నారులకు వారు ఆదర్శంగా మారారని కొనియాడారు. ఫిట్నెస్ కాపాడుకోవడానికి, ఊబకాయం తగ్గించుకోవడానికి ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని సూచించారు. అదేవిధంగా మేఘాలయ ఎరీసిల్క్కు జీఐ ట్యాగ్ లభించిందని చెప్పారు. పురుగులను చంపకుండా వస్త్రాన్ని తయారు చేయడం దాని ప్రత్యేకతని తెలిపారు. భారత్ ట్రకోమా రహిత దేశంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన విషయాన్ని ప్రధాని గుర్తుచేశారు. అదేవిధంగా యోగా డే గురించి కూడా ఆయన ప్రస్తావించారు. యోగాలో డే లో లక్షలమంది పాల్గొన్నారని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో బౌద్ధ క్షేత్రాలకు విదేశాల్లో అత్యంత ప్రాధాన్యం ఉందని చెప్పారు. అందరూ తమతమ ప్రాంతాల్లోని బౌద్ధ క్షేత్రాలను ఒక్కసారైనా సందర్శించాలని సూచించారు. అదేవిధంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుభాంశు శుక్లాకు ప్రధాని అభినందనలు తెలిపారు