Tirumala | భ‌క్తుల‌తో తిరుమ‌ల కిట‌కిట … అలిపిరి వ‌ద్ద ట్రాఫిక్ జామ్

తిరుమలలో (tirumala) భక్తుల ( Devotees ) రద్దీ పెరిగింది. అలిపిరి (alipiri) చెక్​ పాయింట్​ వద్ద వందలాది కార్లతో ట్రాఫిక్ జామ్ (traffic jam ) అయ్యింది. ఆ మార్గం ద్వారా వెళ్లే వారు ప్రయాణం చేయాలంటే కాస్త ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. వారాంతం కావటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. సొంత వాహనాలతో కొండపైకి రావటంతో అలిపిరి వద్ద భారీగా వాహన రద్దీ ఏర్పడింది.

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీల్లో ఆలస్యం కారణంగా వందలాది కారులు బారులు తీరాయి. అలిపిరి గరుడ కూడలి వరకు వాహనాలు నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం రద్దీతో రెండో కనుమ రోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి. దీనికితోడు అక్కడ రోడ్డు మరమ్మతులు జరుగుతుండటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

భారీగా హుండీ ఆదాయం ….

భారీగా శ్రీవారి హుండీ ఆదాయం: తిరుమల టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనం కంపార్టుమెంట్లు నిండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి వున్నారు. శుక్రవారం శ్రీవారిని 68,229 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారికి 30,559 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.

Leave a Reply