ముంబై : భారత్తో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన సానుకూల వ్యాఖ్యలు దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock markets) కు కొత్త జోష్ ఇచ్చాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీయడంతో పాటు, విదేశీ పెట్టుబడులు (Foreign investments) వెల్లువెత్తడంతో శుక్రవారం ట్రేడింగ్ లాభాలతో ప్రారంభమైంది. ఉదయం 9:15 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 150.40 పాయింట్లు (0.18 శాతం) లాభపడి 83,906.27 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ (Nifty) 54.50 పాయింట్లు (0.21 శాతం) పెరిగి 25,603 వద్ద కొనసాగుతోంది.
Share markets | స్టాక్ మార్కెట్లలో బుల్ జోష్
