పరవాడ (అనకాపల్లి జిల్లా) ఆంధ్ర ప్రభలంకెలపాలెం ప్రధాన జంక్షన్ లో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాజువాక నుంచి అనకాపల్లి వైపు వస్తున్న మార్కెట్ లారీ ఇక్కడ లంకెలపాలెం జంక్షన్ కు చేరుకునేసరికి పరవాడ వైపు నుంచి వస్తున్న భారీ కంటైనర్ ఢీకొనడంతో అందులో ఒక కారు,రెండు ద్విచక్ర వాహనాలను ఈ రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడకు అక్కడే మృతి చెందారు.
ఫార్మా సిటీలో బి షిఫ్ట్ ముగించుకొని తిరిగి వస్తుండగా లంకెలపాలెం జంక్షన్ కి వచ్చేసరికి ఈ ప్రమాదం జరిగింది. అందులో ఒకరు ఫార్మసిటి ఉద్యోగి కాగా మరో ముగ్గురు కారులో ఉన్న వారు మృతి చెందారు.వేరే కారు లో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు ఐయ్యాయి..
పక్కనే ఆగి ఉన్న మరో 8 ద్విచక్ర వాహనాలు పై కన్ టైనర్ లారీ బోల్తా పడింది,, .
గాయ పడిన వారిని అనకాపల్లి ఎన్ టి ఆర్ ఆసుపత్రి కి తరలించారు.. ప్రమాదం సందర్బంగా లంకెలపాలెము బ్రిడ్జి పై నుంచి మూడు కిలోమీటర్లు కు పైగా ట్రాఫిక్ నిలిచి పోయింది