ఆంధ్రప్రభ బ్యూరో నంద్యాల, జూన్ 23 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబిక మల్లికార్జునస్వామి అమ్మవార్లను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) సోమవారం దర్శించుకున్నారు. శ్రీశైలం(Srisailam) కు దర్శనార్థం వచ్చిన ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయం ఏఈఓ హరిదాసు, ప్రజాసంబంధాల అధికారి శ్రీనివాసరావు, అర్చకులు వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించుకుని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో శ్రీనివాసరావు, శ్రీస్వామి అమ్మవార్లకు చిత్రపటం, తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు.