Traced | యురేనియం ఎక్క‌డ దాచారో మాకు తెలుసు – బాంబు పేల్చిన నెత‌న్యాహు

టెల్ అవిన్ – మోతాదుకు మించి యురేనియంను (uranium ) శుద్ధి చేయడంతోనే ఇరాన్ తో ఇజ్రాయెల్‌, (Israel ) అమెరికా (america ) యుద్ధానికి దారి తీసింది. ఇంత భారీ స్థాయిలో దాడి చేసినా.. ఆ శుద్ధి చేసిన యురేనియం జాడ మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అణుబాంబు తయారీకి అవసరమైన 60-90శాతం మధ్యలో దానిని శుద్ధి చేసి స్వచ్ఛమైన యురేనియం 235ను ఇరాన్‌ తయారు చేస్తోందని అమెరికా, ఇజ్రాయెల్‌, పశ్చిమ దేశాల ఆరోపించాయి. ఇరాన్‌ న్యూక్లియర్‌ ప్లాంట్లలో 60 శాతం శుద్ధి చేసిన 400 కిలోల యురేనియం ఉందని తేలింది ఇక, యూఎస్ దాడులు చేసే నాటికే దేశంలోని శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్లు ఇరాన్‌ పేర్కొంది. వీటిల్లో కొంత ఫోర్డో అణు కేంద్రం నుంచే తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, జూన్‌ 19వ తేదీన 16 ట్రక్కుల కదలికలను అమెరికాకు చెందిన మ్యాక్సర్‌ టెక్నాలజీస్‌ గుర్తించింది.

ఇక ఇరాన్ 60 శాతం శుద్ధి చేసిన 400 కిలో గ్రాముల యురేనియం గురించి ఆసక్తికరమైన ఇంటెలిజెన్స్‌ రిపోర్టు తమకు అందిందని ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. కానీ, ఆ వివరాలు బయటకు చెప్పడం కుదరదు అన్నారు. తాము హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లాను చంపేసిన తర్వాత ఇరాన్‌ అణ్వాయుధాల తయారీ మొదలు పెట్టిందని వెల్లడించారు. దీంతో పాటు ఇరాన్‌ నెలకు 300 బాలిస్టిక్‌ క్షిపణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకొచ్చి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరాన‌న్నారు… డొనాల్డ్ ట్రంప్‌ కూడా అర్థం చేసుకొని యూఎస్ కి మంచి జరిగే నిర్ణయమే తీసుకున్నారని నెతన్యాహు తెలిపారు. ఇరాన్‌ విషయంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలకు అత్యంత చేరువలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి, అణు కేంద్రాలకు గణనీయమైన నష్టం కలిగించామని ఆయన తెలిపారు. అయితే, లక్ష్యాలు పూర్తిగా నెరవేరే వరకు తమ సైనిక చర్యలను ఆపేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా ఇరాన్‌ యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయో తమకు తెలియదన్నారు. వాటిని కనుక్కునే దిశగా అమెరికా ప్రణాళిక రచిస్తుందన్నారు.

Leave a Reply