India vs England |తొలి వన్డే …. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..
నాగపూర్ – మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ నాగపూర్ లో ప్రారంభమైంది.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియాను బౌలింగ్కు ఆహ్వానించింది. హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. ఇక గాయం కారణంగా కోహ్లీ మ్యాచ్ కు దూరంగా కాగా,కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ కు జట్టులో చోటు దక్కలేదు.. వరుణ్ చక్రవర్తిని సైతం పక్కన పెట్టారు..
జట్లు: ఇంగ్లండ్: డకెట్, సాల్ట్, రూట్, బ్రూక్, బట్లర్ (కెప్టెన్), లివింగ్స్టన్, బెతెల్, బ్రెడన్ కార్స్, ఆర్చర్, అడిల్ రషీద్, సకిబ్ మహమూద్.
భారత్: రోహిత్ (కెప్టెన్), యశస్వి, శ్రేయస్, శుభ్మన్, రాహుల్, హార్దిక్, అక్షర్ పటేట్, జడేజా, హర్షిత్ రాణా, కుద్దీప్ యాదవ్, షమి.