Maoists Blast | మందుపాత‌ర‌ పేలుడులో ఐదుకు పెరిగిన మృతుల సంఖ్య


వాజేడు మండలంలో మావోయిస్టుల మందుపాత‌ర‌కు ఐదుగురు పోలీసులు బ‌ల‌య్యారు. వాజేడు మండ‌లం పెనుగోలు, గుట్టలు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఎలిమిడి గుట్టల మధ్య గ్రేహౌండ్స్ బలగాలు వాగు దాటుతుండగా చంద్రన్న దళం మందుపాత‌ర‌ను పేల్చింది. ముగ్గురు పోలీసులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారు. మార్గ‌మ‌ధ్య‌లో మ‌రో ఇద్ద‌రు మృతి చెందారు. దీంతో వాజేడు, వెంక‌టాపురం, చ‌ర్ల త‌దిత‌ర ప్రాంతాల్లో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం వ‌రంగ‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అలాగే గాయ‌ప‌డిన వారికి ఏఎంజీ ఆస్ప‌త్రిలో చేర్పించారు. కొంద‌రు ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని స‌మాచారం.

Leave a Reply