After 2017 | రేపటి నుంచి రెండు రోజులు అక్క‌డే..

After 2017 | రేపటి నుంచి రెండు రోజులు అక్క‌డే..

ట్రంప్‌తో పాటు టెస్లా, ఆపిల్ సీఈవోలతో కూడిన ఉన్నతస్థాయి బృందం
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు
వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ వివాదం, తైవాన్ అంశాలపై ప్రధానంగా చర్చ
ట్రంప్ రాక సందర్భంగా బీజింగ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

After 2017 | వాషింగ్ట‌న్, ఆంధ్ర‌ప్ర‌భ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కీలక చర్చల కోసం ఆ దేశానికి బయలుదేరారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ వివాదం, తైవాన్ వంటి అంశాలు ఈ భేటీలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. 2017 తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.

After 2017 | వాణిజ్య సంబంధాలే కీలకం..

ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ ఈ పర్యటనకు వెళ్లారు. ఆయన బుధవారం బీజింగ్‌కు చేరుకోనుండగా, గురు, శుక్రవారాల్లో షీ జిన్‌పింగ్‌తో అధికారిక చర్చలు జరుపుతారు. “ట్రంప్ చైనాకు బయలుదేరారు” అంటూ వైట్‌హౌస్‌కు చెందిన ‘రాపిడ్ రెస్పాన్స్ 47’ ఎక్స్ ఖాతాలో చిత్రాలతో సహా పోస్ట్ చేశారు. ఈ చర్చల్లో వాణిజ్య సంబంధాలే కీలకం కానున్నాయి. అమెరికాతో చైనాకు ఉన్న భారీ వాణిజ్య మిగులుపై ట్రంప్ మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. గత అక్టోబర్‌లో దక్షిణ కొరియాలో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య టారీఫ్ యుద్ధానికి ఏడాది పాటు విరామం ప్రకటించారు. ప్రస్తుత భేటీలో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

After 2017 | ఇరాన్ వివాదం కూడా..

ఇరాన్‌తో కొనసాగుతున్న వివాదం కూడా ఈ భేటీలో ముఖ్యమైన అంశంగా మారింది. ఇరాన్‌పై తమ ప్రభావాన్ని ఉపయోగించి, వాషింగ్టన్‌తో దౌత్య ఒప్పందానికి సహకరించాలని ట్రంప్ చైనాను కోరనున్నట్లు సమాచారం. చైనా ఇరాన్‌కు కీలక ఆర్థిక భాగస్వామిగా, ఆ దేశ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్ పర్యటనలో ఆయనతో పాటు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వంటి అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ట్రంప్ రాక సందర్భంగా బీజింగ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

CLICK HERE TO READ MORE ; 401billion tons | కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు

CLICK HERE TO READ MORE