ప్రభుత్వ ఉర్దూ పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలు

ప్రభుత్వ ఉర్దూ పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలు
50 ఏళ్ల పాఠశాలలో సీనియర్ విద్యార్థులందరి భాగస్వామ్యం
ఎడపల్లి, ఆంధ్రప్రభ : 1974-1975 సంవత్సరంloలో నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, ఏఆర్పి క్యాంపులోని రైతు సంక్షేమ శిక్షణా కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం 50 సంవత్స రాల స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఎస్.ఎస్.సి బ్యాచ్ విద్యార్థులు ఒక ఘనమైన “గెట్ టు గ్యాదర్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాస్త్రవేత్త ఉస్మాన్ అధ్యక్షత వహించగా, సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అలీ ఖాన్ ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో 1975వ సంవత్సరం ఎస్.ఎస్.సి. బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
వారిలో ముహమ్మద్ ఫసిహుద్దీన్ షాలిమార్, ఆర్&బి విభాగం నుండి రిటైర్ అయిన ఎం.ఏ. హఫీజ్, యూసుఫ్ అన్సారీ, ముహమ్మద్ హమీద్ ఖాన్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు సయ్యద్ అహ్మద్ బుఖారీ, ముహమ్మద్ ఇబ్రహీం మున్షీ, ఇజాజుల్లా ఖాన్, మొయిన్ సిద్ధిఖీ, ఎం.ఏ. సమద్, ముహమ్మద్ ముజమ్మిల్, ట్రాన్స్కో విభాగం నుండి రిటైర్ అయిన ముహమ్మద్ వహాబ్, మీర్జా ఇద్రీస్ బేగ్, మీర్జా కలీముల్లా బేగ్, సిదర్షాద్ హుస్సేనీ, ముహమ్మద్ అహ్మద్ హమ్దార్డ్, మీర్జా రహీం బేగ్, ఎం.ఏ. రౌఫ్తో పాటు, రిటైర్డ్ వ్యవసాయ శాఖకు చెందిన ముహమ్మద్ వాజిద్ హుస్సేన్, ఇంజనీర్ షానవాజ్ అహ్మద్ ఖాన్ షిరాజ్, ముహమ్మద్ ఫహద్ ఖాన్, ముహమ్మద్ ఇస్రార్ అహ్మద్ బోధన్, ముహమ్మద్ ఇక్రమ్ హుస్సేన్ పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో, దివంగతులైన తోటి ఎస్.ఎస్.సి. విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా, పాల్గొన్న సీనియర్ విద్యార్థులందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, ఎస్.ఎస్.సి (50) సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందించుకున్నారు. గత 50 సంవత్సరాలలో తమ జీవితంలోని ఒడిదుడుకు లను, సంతోష క్షణాలను గుర్తుచేసుకుంటూ, ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నం దుకు తమ ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేశారు.
