rs.220| మళ్లీ మొదలైన పసిడి పరుగు

rs.220| మళ్లీ మొదలైన పసిడి పరుగు
rs.220 | పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం
బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి
బంగారం, వెండి ధరల్లో కూడా భారీ మార్పులు
rs.220 ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. శ్రీరామనవిమి సందర్భంగా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్లో పసిడి ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్. కొద్ది రోజులుగా ఊగిసలాడుతున్న బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్త పరిస్థితులు బంగారం ధరల ర్యాలీకి కారణమవుతున్నాయి. దేశీయ మార్కెట్లో నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కూడా పెరిగాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తొంది. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అయితే, బంగారం, వెండి ధరల్లో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం ప్రధానంగా 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులానికి (10 గ్రాములు) రూ.220 మేర పెరిగి రికార్డు స్థాయిలకు చేరువలో ట్రేడ్ అవుతోంది. వెండి ధర భారీగా తగ్గింది.


