నర్సంపేట మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం..
నర్సంపేట మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం..
కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీల అభివృద్ధి..
కాంగ్రెస్తో అభివృద్ధి శూన్యం
మున్సిపల్ ఎన్నికల్లో రోడ్షో.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
నర్సంపేట అభివృద్ధి ఘనత పెద్దిదే.
అభివృద్ధికి పట్టం కట్టాలి.
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పూర్తి శూన్యమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం శనివారం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో రోడ్ షోలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ.. నర్సంపేట మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇది యువత సహకారంతోనే సాధ్యమవుతుందని గుర్తు చేశారు. 16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బానోత్ నవీన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి మున్సిపాలిటీకి కౌన్సిలర్ గా పంపాలని గ్రామ యువకులను ఉత్తేజపరిచారు. నవీన్ను మీరు గెలిపించండి.. అభివృద్ధి మేము చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ బానోతు సారంగపాణి, మచ్చిక నర్సయ్యతో పాటు వివిధ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతించారు.
బానోతు నవీన్ పై దృష్టి
16వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బానోతు నవీన్ పై పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. నవీన్ గెలిచిన తర్వాత మున్సిపాలిటీకి అభివృద్ధి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ ర్యాలీలో ఇన్చార్జ్ బానోతు సారంగపాణి, మచ్చిక నర్సయ్యతో పాటు వివిధ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధి ప్లాన్
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నర్సంపేట మున్సిపాలిటీలో రోడ్లు, పార్కులు, నీటి సరఫరా, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ పాలనలో జరిగిన మహిళా సమాఖ్య భవనాలు, మార్కెట్ కాంప్లెక్సుల వంటి ప్రాజెక్టులను ఉదాహరణగా చెప్పారు. గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతించి, బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలిపారు.
