తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డు సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
వేసవి ప్రారంభమైన నేపథ్యంలో నీటికోసం ఏనుగుల గుంపు మొదటి ఘాట్రోడ్డులోని ఏడవమైలు వద్ద సంచరించాయి.
ఏనుగుల ఘీంకారాలతో నడకదారిలో తిరుమలకు వస్తున్న భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. మరి కొంతమంది భక్తులు తమ సెల్ఫోన్లలో ఆ దృశ్యాలను చిత్రీకరించారు.
ఈ సమాచారం అందుకున్న టిటిడి అటవిశాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శబ్దాలను చేస్తూ ఏనుగుల గుంపును అటవి ప్రాంతంలోకి మళ్ళించారు.