Vikasith Bharath | సంకల్పానికి అండగా నిలవాలి….

Vikasith Bharath | సంకల్పానికి అండగా నిలవాలి….

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

Vikasith Bharath | భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ : భారత్ ను విశ్వ గురువుగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) వికసిత్ భారత్(Vikasith Bharath) పేరిట శక్తివంచన లేకుండా చేస్తున్న కృషికి దేశ ప్రజలు అండగా నిలవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ రోజు కొత్త కొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారినీ ఆయన దర్శించుకోవడం జరిగింది. కేంద్ర మంత్రి రాక సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం తో ఆహ్వానించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కోరిన కోరికలు తీసే కూర మీసాల స్వామిని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా దర్శించుకోవడం ఆనవాయితీగా జరుగుతోందని ఆయన అన్నారు. ఈ దేశం సుభిక్షంగా ఉండాలని తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పూర్తిచేసే విధంగా ముగ్గుల పోటీలు(Competitions) సంక్రాంతి పోటీలు నిర్వహిస్తూ ప్రజలంతా ఆనందంగా ఉండాలని హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా చూడాలని ఆ స్వామి వారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఎంతో ప్రతిష్ట కలిగిన కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయానికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

Vikasith Bharath |

అదేవిధంగా ఆలయ అభివృద్ధికి సహకరిస్తూనే భవిష్యత్తులో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని నా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య,జిల్లా కౌన్సిల్ సభ్యుడు పృథ్వీరాజ్, స్థానిక సర్పంచ్ సిద్ధమల్లా రమా రమేష్, మాచర్ల కుమారస్వామి, బోయిని మహేష్ వీరితోపాటు వివిధ గ్రామాల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Vikasith Bharath |
Vikasith Bharath |

CLICK HERE TO READ MORE : Chaina Manja | సీధా అందర్‌ … నేరుగా జైలుకే…

CLICK HERE TO READ MORE :