Temple | కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ

Temple | కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ
Temple | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరి జరిగింది. దేవాలయం వెనుక ద్వారం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి.. వెండి, బంగారు నగలు చోరీ చేసినట్లు గుర్తించారు. సుమారు రూ.35 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆలయ ధర్మకర్త వెల్లడించారు. గత నవంబర్ నెలలో ఇదే ఆలయంలో తొక్కిసలాట ఘటన చోటుచేసుకుని 9మంది మృతిచెందారు. అప్పటి నుంచి ఆలయాన్ని మూసివేశారు.
