Rs.820 | హైదరాబాద్లో ఒక్కరోజే భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు

Rs.820 | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేట్లు ఇవాళ ఒక్కసారిగా పెరగడంతో కొనుగోలుదారులు షాక్కు గురయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్ మారకం విలువలో మార్పులు, పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో పసిడి ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
24 క్యారెట్ల బంగారంపై రూ. 820 పెరుగుదల
తాజా ధరల ప్రకారం హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ.1,57,040కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి రూ.1,43,950గా నమోదైంది. ఒక్కరోజులోనే ఇంత భారీ పెరుగుదల రావడంతో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెండి ధర స్థిరంగా.. మార్కెట్లో ఆందోళన
మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3 లక్షల వద్ద నిలకడగా ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు మారితే వెండి ధరల్లో కూడా భారీ హెచ్చుతగ్గులు ఉండొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ఎందుకు పెరుగుతున్నాయి బంగారం ధరలు?
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల, డాలర్ బలపడటం వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపడం సాధారణమని, అదే ఇప్పుడు కూడా కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప మార్పులు…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాన్ని బట్టి బంగారం ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చని బులియన్ వ్యాపారులు తెలిపారు. జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, స్థానిక పన్నుల ప్రభావంతో ధరలు మారే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా గోల్డ్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
